పటాన్ చెరు
వచ్చేనెల ఆగస్టు 1వ తేదీన పటాన్ చెరు డివిజన్ పరిధిలో బోనాల పండుగ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఉదయం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో బోనాల పండగ పై స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పుర ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఆగస్టు 1న బోనాల పండుగ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారని, తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని ప్రతిభింభించేలా బోనాల ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరిపేలా చూడాలని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, పట్టణ ప్రముఖులు మనోహర్ రెడ్డి, మాణిక్యం, తులసి దాస్, విజయ్ కుమార్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…