పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెస్త్రిలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ యేడాది అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్ననిపుణులు ఒకరికొకరు తెలియజేసుకునే క్రియాశీల వేదికను అందించడం, ప్రస్తుత పరిశోధనలోని ఆసక్తికర అంశాలు, వినూత్న ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకోవడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఘనీభవించిన పదార్థ పరిశోధనలో భవిష్యత్తు పోకడలపై దృక్పథాన్ని అందిస్తుందని, సంభావ్య సహకారాన్ని,పెంపొందించే అవకాశాలను శోధించేలా ఈ సదస్సు ప్రేరేపిస్తుందన్నారు. అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఉంటాయని, యువ శాస్త్రవేత్తల గోడ పత్రికల ప్రదర్శన (పోస్టర్ ప్రెజెంటేషన్) కూడా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో పత్ర సమర్పణ ఆగస్టు 25న తేదీలోగా చేయొచ్చని, నాణ్యమైన పరిశోధనా పత్రాలను ఎంపిక చేసి క్షుణ్ణంగా సమీక్షించిన ప్రొసీడింగ్ లో ప్రచురిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు. https://forms.qle/s.ikeDxwwpUjfsoCkg లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కోసం సదస్సు నిర్వాహకుడు డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి 96181 77690ని సంప్రదించాలని,icacmp 2023@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా www.gitam.edu/ CACMP2023 ని సందర్శించాలని సూచించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…