Telangana

బయటికెళ్లి ప్రపంచాన్ని అన్వేషించండి

_గీతం తొలి ఏడాది విద్యార్థులకు ఓయో సీజీవో కవికృత్ సూచన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పార్టన్ నెలకొల్పాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థుల ఆలోచనలో స్పష్టత ఉంటే పెట్టుబడి సేకరించడం పెద్ద కష్టమేమీ కాదని ఓయో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (సీజీవో) కనికృత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ తొలి ఏడాది. ప్రవేశం పొందిన విద్యార్థులతో శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. వ్యవస్థాపకులుగా ఎదగాలని అభిలషించే వారు, తమ ఆలోచన సరైనదో, కాదో ముందుగా పరీక్షించుకోవాలన్నారు. తాము విద్యను అభ్యసిస్తున్న ప్రాంగణం వెలుపలికి చెల్లి బయటి ప్రపంచాన్ని అన్వేషించాలని, వినియోగదారులు, భాగస్వాములు, విక్రేతలను కనుగోవాలని, ఆయా అంశాలను తమ అధ్యాపకులతో చర్చించి ప్రయోగాలు ప్రారంభించాలని సూచించారు. అలాగే తాము చేయాలనుకుంటున్న దానిని ఇతర వ్యాపార సంస్థలు ఎలా చేస్తున్నాయో కూడా అధ్యయనం చేయాలన్నారు..ఓయో ఆలోచనలకు సాంకేతిక నైపుణ్యాలను జోడించి వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. తాము ఈ స్థాయికి రావడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓఢ్యామని, దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్వర్క్ హోటళ్లపై బోర్డులు పెట్టడం, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులపై చిన్న బూత్లు పెట్టి బుకింగ్ చేయడం ద్వారా ప్రాచుర్యం పొంది, వినియోగదారుల మన్ననలను చూరగొన్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఓయోలో తన ప్రస్థానం గురించి చెబుతూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, వైఫల్యాల మంచి నేర్చుకుంటూ నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ‘వెఫల్యాలను సునాయాసంగా స్వీకరించండి, నేర్చుకుంటూ ఉండండి, సమతుల్య విధానాన్ని కొనసాగించండి’ అని కనిర్బత్ సూచించారు.కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవాలనేది తన అభిలాష అయినా, ఫైన్స్ చదివానని, తన వృత్తిజీవన ఆరంభంలోనే వ్యాపార అభ్యాసంలోకి అడుగిడినట్టు ఓయో సీజీవో చెప్పారు. జీవితాన్ని క్రికెట్ బంతితో పోలుస్తూ, ఆ బంతిని ఆడడమే. జీవితం అనే హార్డ్వేరు కూడా తాను నేర్చుకున్నట్టు విద్యార్థుల వార్షధ్వానాల మధ్య ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని తెలివిగా, అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, నీలయినంత వరకు దూరంగా ఉండడమే మేలన్నారు.

ఓయో సేవలపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయని, వినియోగదారుల నుంచి నేరుగా అంటే ప్రతిస్పందనను సమీక్షించి, తదనుగుణంగా నోటల్ ర్యాంకింగ్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కవికృత్ చెప్పారు. విద్యార్థులను ప్రశ్నలడిగేలా ప్రోత్సహిస్తూనే, వారిని ఆకట్టుకునేలా జవాబులిచ్చారు.వర్ధమాన వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా సాగిన ఈ కార్యక్రమం ప్రాంగణాల వెలుపల ప్రపంచాన్ని అన్వేషించడానికి ప్రేరణనివ్వడంతో పాటు స్పష్టత ప్రాముఖ్యత, ఆవిష్కరణల పట్ల ఉత్సాహలను సించిందనడంలో అతిశయోక్తి లేదు.కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) విజిటింగ్ ఫ్యాకల్టీ కవితా శర్మ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ డెరెక్టర్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ అతిథిని సత్కరించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago