Telangana

ఇంజనీరింగ్ విభాగాల మధ్య సరిహద్దులను చెరిపివేయాలి

-గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ఎంఐటీ ప్రొఫెసర్ నీలిమ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇంజనీరింగ్ విభాగాల మధ్య సరిహద్దులను చెరిపివేయాలని, సంక్లిష్ట వ్యవస్థల్లోని వివిధ కారకాలు, పరస్పర చర్యలకు సమగ్ర పరిష్కారాలను అభివృద్ధి చేయాలని మణిపాల్, ఎంఐటీలోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలియా బయ్యవు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ యుగంలో అంతర్ విభాగ పరిశోధన, హెచ్ పీసీ ‘ అనే అంశంపై గురువారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు. కృత్రిమ మేథ యుగంలో సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడంలో, ఆవిష్కరణలను నడపడంలో అంతర్ విభాగ సహకారం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ నీలిమ నొక్కి చెప్పారు. సమాజ అవసరాలు, వృద్ధి పథాన్ని సంగ్రహించడం, అధిక పనితీరు గల కంప్యూటింగ్, నెల్లిక పరిగణనలు, సంఘంతో మమేకమవడం వంటి వాటిని ఆమె వివరించారు. తమ బంగారు భవిష్యత్తు కోసం కృత్రిమ మేథ పనిభారం కోసం ప్రత్యేక హార్డ్ వేర్ నిర్మాణాలను అభివృద్ధి చేయడంపై ఈసీఈ విద్యార్థులు దృష్టి సారించాలని డాక్టర్ నీలిము సూచించారు. పనితీరు, శక్తి సామర్ధ్యాలను మెరుగుపరచడానికి టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్నెకింగ్ న్యూరల్ నెట్ వర్క్స్ ల వంటి కృత్రిమ మేథ వేగం పెంచడం కోసం నూతనడిజైన్ లను అన్వేషించాలన్నారు. తక్కువ శక్తితో నడిచే కృత్రిమ మేథ ప్రాసెసింగ్ యూనిట్లు, హెచ్ పీసీ కోసం అత్యంత వేగవంతమైన ఇంటర్ కనెక్టులు , కృత్రిమ మేథ-హెచ్ పీసీ ల అనుసంధానం కోసం మెమురీ ఆర్కిటెక్చర్లు, కృత్రిను మేథ ఆధారిత చిల్ల రూపకల్పనతో పాటు విశ్వసించదగ్గ భద్రతం గురించి నేర్చుకోవాలన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి అతిథిని సత్కరించగా, ఈఈసీఈ విభాగాధిపతి. ప్రొఫెసర్ టి.మాధవి స్వాగతించారు. ప్రొఫెసర్ పి. త్రినాథరావు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago