* ఆలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానించిన కమిటీ
* కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధు ముదిరాజ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, నారాయణరెడ్డి, నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వీరస్వామి, అంజిరెడ్డి, ఆలయ కమిటీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…