Hyderabad

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….

– ఈటల రాజేందర్

హైదరాబాద్:

హుజురాబాద్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందని… ఇది కురుక్షేత్రయుద్ధం గా అభివర్ణించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ .
20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని..
అధికారంలో ఉన్న నాడు,లేని నాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పని చేసి ప్రజల మెప్పు పొందాని ఈటల అన్నారు.నియోజకవర్గ ప్రజలు
బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని..పెళ్ళిళ్ళు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కులు రావడం లేదంటున్నారు.
కొత్త పెన్షన్ లు ,రేషన్ కార్డ్ లు వెంటనే ఇప్పియ్యలని ముఖ్య మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు.

తాను గాలికి గెలువ లేదని…ప్రజలు నన్ను నమ్మి వోట్ వేస్తే గెలిచానని చెప్పుకొచ్చారు. ఎం.పి.ఎన్నికల్లో 50 వేల పై చిలుకు మెజారిటీ నన్ను చూసి ఇచ్చారని గుర్తు చేశారు.తాను
ఏనాడు వేరే పార్టీ పెడుత అని చెప్పలేదని…మీరే నన్ను బహిష్కరించారని చెప్పారు.మీరు తోడుకున్న బొందలో మీ ప్రభుత్వమే పడ్తుందని ఈటల అన్నారు.ఈటెల గెలుపు అంటే ఆత్మ గౌరవం గెలుపన్నారు.

నా లాంటి వాడు మాట్లాడితే నే మీకు తెలుస్తుంది.ధాన్యం ప్రభుత్వం కొంటుంది అని చెప్పిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు.కొంత మంది చెంచా గాలతో నా మీద కరపత్రాలు కొట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి నన్ను ఓడ గొట్టే ప్రయత్నం చేశారని..అన్ని బరించానని….అది నా సహనం తప్ప భయం కాదన్నారు. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలిపారు.

ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగ బోతుందని
..ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధం అని ఈటల అన్నారు.ఈ యుద్ధం లో విజయం హుజూరాబాద్ ప్రజలదన్నారు.

ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చెయ్యండి దొంగ దారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు ఊరుకోరన్నారు.

Venu

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago