కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయం
మన వార్తలు ,పటాన్ చెరు:
పెన్నార్ పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులందరికీ రుణపడి ఉంటామని, కార్మికుల అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పటాన్చెరువు శాసనసభ్యులు, గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి తాను బలపరిచిన అభ్యర్థి రాంబాబు యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం నుండి న్యాయబద్ధంగా రావలసిన ప్రతి హక్కును సాధిస్తామని, ప్రధానంగా వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సహృద్భావ వాతావరణంలో విధులు నిర్వహించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్మికులందరూ సోదరభావంతో కలిసి మెలసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, పెన్నార్ పరిశ్రమ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…