మనవార్తలు ,పటాన్చెరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బిజెపి నేడు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయితే, ప్రధాని స్థాయి వ్యక్తులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో బీజేపీని తరిమికొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…