Districts

రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

మనవార్తలు , పటాన్ చెరు:

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మించ దలచిన డి సి సి బి నూతన బ్రాంచ్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు చిరు వ్యాపారులకు, సంస్థలకు వివిధ పథకాల ద్వారా రుణాలు అందించడంలో డిసిసిబి ముందంజలో ఉందని అన్నారు.

ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరితగతిన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. బ్యాంకు అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మాణిక్యం, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago