politics

ఈ ఏడాది చివరకు పది స్టార్టప్లు : గీతం ప్రోవీసీ

మనవార్తలు,పటాన్ చెరు:

విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని , అందుకు అవసరమైన వనరులన్నీ అందుబాటులోకి తెచ్చామని , ఈ ఏడాది చివరి నాటికి కనీసం పది స్టార్టప్లు గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి వస్తాయని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఆశాభావం వ్యక్తపరిచారు . ‘ ఆరంభ్ ‘ పేరిట అధ్యాపకుల కోసం వ్యవస్థాపకుల ప్రోత్సాహక దినోత్సవాన్ని గీతం హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , ఈ – క్లబ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ( వీడీసీ ) లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రొఫెసర్ డీఎస్ రావు సభాధ్యక్షత వహించారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ , పారిశ్రామికులుగా విద్యార్థులు ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులు , మార్గదర్శనం కల్పించామని , దాదాపు ఆరువేల పైచిలుకు విద్యార్థులు , 300 మంది నిబద్ధత గల అధ్యాపకుల మార్గదర్శనంలో కనీసం పది మంది స్టార్టప్లు నెలకొల్పడానికి ముందుకొస్తారని అభిలషించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిష్ నంగెగడ్డ మాట్లాడుతూ , తాము శ్రీకారం చుట్టిన ఈ ప్రక్రియ అనేక ఆవిష్కరణలు , స్టార్టప్లకు దారితీయగలదని ఆశాభావం వెలిబుచ్చారు . వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనేవారు , వ్యవస్థాపకులుగా ఎదిగే ఆలోచనతో పనిచేస్తారని , సవాళ్ళలో అవకాశాలను ఎతుక్కోగలరని , ఎటువంటి ఆటుపోట్లకు వెన్ను చూపబోరని స్పష్టీకరించారు . ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని , సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుకునే వారికి ఇదో నాందీ ప్రస్థావనగా ఆయన అభివర్ణించారు .

విద్య అనుభవపూర్వకంగా ఉండాలని , స్వీయ హస్తాలతో చేయడం ద్వారా నేర్చుకోవడానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు . బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం పనిచేస్తోందని , విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని తాము గీతమ్ కల్పించినట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య క్రిష్ ప్రకటించారు . టెక్టోరో నుంచి కిరణ్ కుమార్ , హెడ్రోఫోనిక్స్ప ఆర్కిటెక్చర్ అధ్యాపకురాలు బీఎన్ కీర్తినాయుడు వివరించారు .

తొలుత , వీడీసీ బెంగళూరు డిప్యూటీ డెరైక్టర్ మహేష్ వారియర్ ఈ కార్యక్రమ ఉద్దేశాలు , లక్ష్యాలను వివరించారు . వీడీసీ బృందంతో కలిసి గీతం సెనెస్ డీన్ ప్రొఫెసర్ బాల్కుమార్ , రీసెర్చ్ డెరైక్టర్ ప్రొఫెసర్ రాజా పి పప్పు అధ్యాపకులకు వర్క్షాప్ను నిర్వహించారు . మాస్టర్ క్లాస్ , వర్క్షాప్లు , పిచింగ్ సెషన్లు , ముఖాముఖి మార్గదర్శనం , విజయవంతమైన స్టార్టప్ల ప్రదర్శన , ఆటలతో సోమవారం నాడంతా గీతం ప్రాంగణం కోలాహలంగా కనిపించింది .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago