politics

ఈ ఏడాది చివరకు పది స్టార్టప్లు : గీతం ప్రోవీసీ

మనవార్తలు,పటాన్ చెరు:

విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని , అందుకు అవసరమైన వనరులన్నీ అందుబాటులోకి తెచ్చామని , ఈ ఏడాది చివరి నాటికి కనీసం పది స్టార్టప్లు గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి వస్తాయని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఆశాభావం వ్యక్తపరిచారు . ‘ ఆరంభ్ ‘ పేరిట అధ్యాపకుల కోసం వ్యవస్థాపకుల ప్రోత్సాహక దినోత్సవాన్ని గీతం హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , ఈ – క్లబ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ( వీడీసీ ) లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రొఫెసర్ డీఎస్ రావు సభాధ్యక్షత వహించారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ , పారిశ్రామికులుగా విద్యార్థులు ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులు , మార్గదర్శనం కల్పించామని , దాదాపు ఆరువేల పైచిలుకు విద్యార్థులు , 300 మంది నిబద్ధత గల అధ్యాపకుల మార్గదర్శనంలో కనీసం పది మంది స్టార్టప్లు నెలకొల్పడానికి ముందుకొస్తారని అభిలషించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిష్ నంగెగడ్డ మాట్లాడుతూ , తాము శ్రీకారం చుట్టిన ఈ ప్రక్రియ అనేక ఆవిష్కరణలు , స్టార్టప్లకు దారితీయగలదని ఆశాభావం వెలిబుచ్చారు . వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనేవారు , వ్యవస్థాపకులుగా ఎదిగే ఆలోచనతో పనిచేస్తారని , సవాళ్ళలో అవకాశాలను ఎతుక్కోగలరని , ఎటువంటి ఆటుపోట్లకు వెన్ను చూపబోరని స్పష్టీకరించారు . ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని , సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుకునే వారికి ఇదో నాందీ ప్రస్థావనగా ఆయన అభివర్ణించారు .

విద్య అనుభవపూర్వకంగా ఉండాలని , స్వీయ హస్తాలతో చేయడం ద్వారా నేర్చుకోవడానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు . బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం పనిచేస్తోందని , విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని తాము గీతమ్ కల్పించినట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య క్రిష్ ప్రకటించారు . టెక్టోరో నుంచి కిరణ్ కుమార్ , హెడ్రోఫోనిక్స్ప ఆర్కిటెక్చర్ అధ్యాపకురాలు బీఎన్ కీర్తినాయుడు వివరించారు .

తొలుత , వీడీసీ బెంగళూరు డిప్యూటీ డెరైక్టర్ మహేష్ వారియర్ ఈ కార్యక్రమ ఉద్దేశాలు , లక్ష్యాలను వివరించారు . వీడీసీ బృందంతో కలిసి గీతం సెనెస్ డీన్ ప్రొఫెసర్ బాల్కుమార్ , రీసెర్చ్ డెరైక్టర్ ప్రొఫెసర్ రాజా పి పప్పు అధ్యాపకులకు వర్క్షాప్ను నిర్వహించారు . మాస్టర్ క్లాస్ , వర్క్షాప్లు , పిచింగ్ సెషన్లు , ముఖాముఖి మార్గదర్శనం , విజయవంతమైన స్టార్టప్ల ప్రదర్శన , ఆటలతో సోమవారం నాడంతా గీతం ప్రాంగణం కోలాహలంగా కనిపించింది .

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

12 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

1 day ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 days ago