మనవార్తలు ,పటాన్ చెరు:
బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు . ఆ కంపెనీలో ప్రతిభచాటి ఒక్కోమెట్టూ అధిగమిస్తూ రిక్రూటర్ స్థాయికి చేరిన ఆయన , కలిసొచ్చిన కరోనా లాక్ డౌన్ సమయాన్ని పది మంది తనలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉపకరించేందుకు పూనుకున్నట్టు తెలియజేశారు .
ప్రస్తుతం అనేక భారతీయ ఐటీ కంపెనీలు జాతీయ అర్హతా పరీక్షలను ( ఎన్యూటీలు ) నిర్వహిస్తూ , బీటెక్ చివరి ఏడాది విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయని , అయితే , సరైన మార్గదర్శనం లేక గ్రామీణ విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నట్టు భాను గ్రహించినట్టు పేర్కొన్నారు . ఈ లోటును పూరించడంలో భాగంగా , తన పదేళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంతో , తనకున్న ఫ్రెషర్ రిక్రూట్మెంట్ నెపుణ్యాలను రంగరించి , ప్రాంగణంలో ఉండగానే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఐటీ ఉద్యోగం సంపాదించే మార్గదర్శనంతో ‘ ఐటీ బెల్స్’ను వెలువరించినట్టు వివరించారు . ఐటీ పరిశ్రమలో ప్రవేశించాలని అభిలషించే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశంగా ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిపారు .
విద్యార్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకునే వరకు ప్రిపరేషన్ ప్లాన్ను రూపొందించడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు . కానీ , ఇంటర్వ్యూ పూర్తి భిన్నమైనదని , అసలెన ఇంటర్వ్యూ వాతావరణంలో విద్యార్థులను నిమగ్నం చేయడానికి , వాస్తవ ప్రపంచ ఇంటర్వ్యూ వీడియోలు , వీక్లీ ఇండస్ట్రీ హ్యాంగవుట్లు , గ్రూప్ కోచింగ్ సెషన్లు , వ్యక్తిగత మార్గదర్శక ప్రోగ్రామ్ల వంటి వంద శాతం అనుభవపూర్వ అభ్యాసాలతో కూడిన పాఠ్యాంశాలను ఉదయ్ భాను అభివృద్ధి చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు . ఈ పుస్తకం అర్హత ఉన్న ఇంజనీర్లను ఉద్యోగం సాధించగల సత్తా ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో తోడ్పడగలదనే భరోసాను వెలిబుచ్చారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…