Telangana

పటాన్చెరులో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సీఎం కేసీఆర్ అకుంటిత దీక్ష, మొక్కవోని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి దశ ఉద్యమం నాటి నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజంలో ఉన్న పడి ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు 10 సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణగా రూపాంతరం చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని అభివృద్ధికి ప్రత్యేకంగా నిలుపుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago