పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మట్టి వినాయకులను పూజించి పర్యావరణంను పరిరక్షిద్దామని బిఆర్ఎస్ నాయకులు ఎండి అభిద్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీలో వెయ్యి వినాయక ప్రతిమలను కాలనీవాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభిద్ మాట్లాడుతు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో నా వంతుగా ప్రతి ఏటా కాలనీవాసులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీనితోపాటు ప్రతి ఏటా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కనుగుణంగా సర్వ మతాల పండుగలను సోదరా భావంతో చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం విషతుల్యంగా మారి జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మెరాజ్ ఖాన్, పుణ్యవతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…