డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
పటాన్చెరు
మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తెలిపారు.
సోమవారం పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ తన నామినేషన్ పత్రం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తన నామినేషన్ ను బలపరుస్తున్నారనీ ఫోర్జరీ సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు.
తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ పై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…