Telangana

విజయవంతంగా ముగిసిన కార్యశాల, ఫీల్డ్ విజిట్….

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి :

స్టార్టప్లు, వర్ధమాన పారిశ్రామికవేత్తలను సన్నద్ధం చేసే లక్ష్యంతో గీతం హెదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) నిర్వహిస్తున్న ఆరు రోజుల ‘సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా ‘డిజెన్ థింకింగ్ వర్క్షాప్’తో పాటు ‘వెంచర్ ఫారెస్ట్ ట్రయల్స్’ పేరిట క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. సమస్య-పరిష్కార నెపుణ్యాలు, ఆవిష్కరణ వ్యూహాలతో కూడిన ఈ వర్క్షాప్ను వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్ లు వాసుదేవ్ వంగర, యామిని రాపేటి నిర్వహించారు. క్షేత్ర పర్యటనను కూడా వారు పర్యవేక్షించారు. వ్యాపారం విజయవంతం కావాలంటే, వినియోగదారుల అవసరాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడం, సృజనాత్మకంగా యోచించడం వంటి మెళకువలను వారు వివరించారు.ఈ ప్రపంచ సంక్షోభానికి వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ‘జీవవైవిధ్య నష్టం’ అనే ఇతివృత్తంతో సమస్య-పరిష్కారానికి మానవ-కేంద్రీకృత విధానంపై ఈ కార్యశాల దృష్టి సారించడంతో పాటు స్టార్టప్ల విజయంలో దాని పాత్రను వివరించారు.సవాళ్లను సరికొత్త దృక్పథంతో ఎదుర్కోవడానికి, ఆవిష్కరణలు చేయడానికి, వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, సేవలు అందించడానికి ఈ కార్యశాలలో చేసిన మార్గదర్శనం తమకు ఎంతో తోడ్పడుతుందని ఇందులో పాల్గొన్న విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలాగే క్షేత్ర పర్యటన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago