Telangana

ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : 

ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ ,తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పిట్ల నగేష్ ముదిరాజ్, బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వినమర్తి అనిల్, కోరవికృష్ణస్వామి సేవాసమితి ప్రెసిడెంట్ నగేష్,తదితరులు హాజరయ్యారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులను బి.సి డి నుంచి బిసి ఏ లోకి మార్చాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ముదిరాజులకు కేటాయించాలని కోరారు. చేపల పంపిణి చేయాలని,చేపల కార్పొరేషన్ వ్యవస్థల్లో ముదిరాజులకు అవకాశం కల్పించి, పదివేల కోట్లతో కార్పొరేషన్లను విడుదల చేయాలని, మహిళాలకు కూడా రాజకీయాల్లో స్థానం కల్పిస్తూ మహిళాసాధికారతకై కృషి చేయాలని, ముదిరాజులకు రిజర్వేషన్ శాతం పెంచాలని,ట్యాంకుబండ్ పైన ముదిరాజుల మహనీయుల విగ్రహాలను ప్రతిష్టింప చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, ప్రధాన నాయకులు,మేధావులు,యువత,మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొని ముదిరాజుల భవిష్యత్ ప్రణాళికలను, కార్యాచరణ గురించి చర్చలు జరిగాయని అఖిల పక్ష సమావేశ నిర్వాహకులు శివ ముదిరాజ్ తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago