పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులో ఏప్రిల్ 3-4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ఏఐ రంగంలో జ్జాన మార్పిడి, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక వేదికగా తోడ్పడింది. ఈ సదస్సు ఏఐ జనరేటెడ్ మోడల్స్, ఆటోమేటెడ్ లెటర్ జనరేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లపై దృష్టి సారించే ముందస్తు కార్యశాలలతో ప్రారంభమైనట్టు సదస్సు నిర్వహకురాలు డాక్టర్ నందిత భంజ చౌధురి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, వెరిజోన్ డేటా సర్వీసెస్ తో సహా ప్రముఖ సంస్థల నుంచి అనేక మంది ప్రముఖ వక్తలు ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్, అంతకు మించి ఏఐ-ఆధారిత ఆవిష్కరణపై సదస్యులకు లోతైన అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో పాల్గొన్నవారు అంతర్దృష్టి చర్చలతో పాటు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకున్నట్టు చెప్పారు. మేధోపరమైన చర్చ, మార్గదర్శక పురోగతుల కేంద్రంగా ఈ సదస్సు నిరూపితమైందన్నారు. ఏఐ, దాని వినియోగిస్తున్న నిపుణులు కొంతమందిని ఒకచోట చేర్చినట్టు తెలిపారు. వారందరికీ హృదయ పూర్వక కృతజ్జతలను డాక్టర్ నందిత తెలియజేశారు. చివరగా, ఈ సదస్సులో స్వయంగా పత్ర సమర్పణ చేసిన వారికి ప్రశంసా పత్రాలను సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాధిపతి ప్రొఫెసర్ శిరీష, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా ప్రదానం చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…