Telangana

సమాజ శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ

గీతం అంతర్జాతీయ గ్రీన్ ఏఐ-2025 సదస్సులో పిలుపునిచ్చిన వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారం అవసరమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్’ (గ్రీన్ ఏఐ-2025) అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాదులోని మహీంద్రా విశ్వవిద్యాలయ ఎమెరిటస్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పూజారి, ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి వంటి విద్యావేత్తలు ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారు. సదస్సు సావనీర్ ను ఆవిష్కరించారు.

ప్రొఫెసర్ అరుణ్ ‘ఇంటర్ ప్రెటబుల్ క్లస్టరింగ్’పై లోతైన అవగాహన కల్పించేలా కీలకోపన్యాసం చేశారు. గ్రీన్ ఏఐ అభివృద్ధి చెందుతున్న రంగమని, ఇటువంటి ట్రెడింగ్ రంగంపై గీతం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. స్థిరమైన కృత్రిమ మేధస్సు యొక్క ఔచిత్యాన్ని వివరిస్తూ, ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో అన్వేషించమని పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు. ఈ సదస్సు ఏఐ, అధిక-పనితీరు గల కంప్యూటింగ్ లో కొత్త పరిశోధనా మార్గాలు, వినూత్న అంశాలతో స్ఫూర్తిస్తుందని ప్రొఫెసర్ అరుణ్ ఆశాభావం వ్యక్తపరిచారు.

దక్షిణ కొరియాలోని యోన్సే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సంగ్-బే చో వర్చువల్ గా ‘డీప్ లెర్నింగ్ పై ఇటీవలి వినూత్న రచనలు: సాఫ్ట్ కంప్యూటింగ్ ల్యాబ్ యొక్క దృక్పథాల’పై కీలకోపన్యాసం చేశారు. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ యొక్క అపారమైన సామర్థ్యాన్ని, నైతిక ఏఐ విస్తరణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఏఐని ఉపయోగించుకోడంలో భారతదేశం, కొరియా మధ్య సహకారం ఎందుకు ఉండకూడదని ప్రొఫెసర్ సంగ్-బే ప్రశ్నించారు.

ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి ‘మెషిన్ లెర్నింగ్ లో పరేటో ఫ్రంట్ ను వెలికితీయడం’పై ఉపన్యసిస్తూ, ఏఐ-ఆధారిత పరిష్కారాలలో ఆప్టిమైజేషన్ పద్ధతులపై విలువైన అంతర్దృష్టులను అందించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అధ్యక్షత వహించారు. సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా అతిథులను స్వాగతించి, సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా 262 పరిశోధనా పత్రాలు ఈ సదస్సులో సమర్పించారని, వాటిలో 40 పత్రాలు స్ప్రింగర్ ప్రచురణకు ఎంపికైనట్టు సదస్సు నిర్వాహకుడు డాక్టర్ శరత్ చంద్ర నాయక్ వెల్లడించారు. మరో రెండు పోస్టర్లను కూడా ఎంపిక చేశామన్నారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

20 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

2 days ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

5 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

5 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 days ago