Telangana

గీతమ్ ను సందర్శించిన శ్రీఆద్య విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్, మాతృశ్రీ నగర్లోని శ్రీఆద్య జూనియర్ కళాశాలకు చెందిన 160 మంది 12వ తరగతి ఎంపీసీ విద్యార్థులు, వారి అధ్యాపకులతో కలిసి శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు. గీతం నిర్వహిస్తున్న పలు కోర్సుల వివరాలతో పాటు అందులో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ల్యాబరేటరీలు, తరగతి గదులు, ప్రపంచ శ్రేణి గ్రంథాలయం, హాస్టళ్లు వంటి వాటిని విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ఓ అవగాహనను ఏర్పరచుకున్నారు.శ్రీఆదర్య విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యశాల, అనుభవపూర్వక అభ్యాసాలను గీతం కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు నిర్వహించారు. తమ అభిరుచికి తగ్గ ఉన్నత విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి ఈ మార్గదర్శనం వారికి ఎంతో ఉపకరించింది. కేవలం విద్యకే పరిమితం కాకుండా సహ, అదనపు పాఠ్యాంశాల ద్వారా సంపూర్ణ పరిణితి సాధించడం ఎలాగో వారు గ్రహించారు. నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణలో పేరొందిన గీతం, తమ ప్రాంగణాన్ని సందర్శించిన విద్యార్థులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది.సామాజిక బాధ్యతలో భాగంగా, ఇంటర్మీడియెట్ విద్యార్థులు, వారి అధ్యాపకులకు కార్యశాలలు, అధ్యాపక వికాస కార్యక్రమాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. వివిధ అంశాలపై వారి నెపుణ్యాలను, పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఉపకరించేలా వీటిని రూపొందించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago