Telangana

రేపు జ్యోతి విద్యాలయలో స్టూడెంట్ ఫెస్ట్

– హాజరుకానున్న పలువురు ప్రముఖులు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటేచదువుతో పాటు అన్నిరకాల విద్యలు కూడా ముఖ్యమేననే సిద్ధాంతాన్ని నమ్మి గత 49 సంవత్సరాలనుండి వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా నైపుణ్యం సాధించడానికి, వారిలో సృజనాత్మకత పెంపోందించడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కృషి చేస్తుందని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు.ఈ నెల 16 అంటే రేపు స్కూల్ ప్రాంగణం లో స్టండెంట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్యతిధులుగా రానున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి క్లాస్ లో ప్రతీ సెక్షన్, టాపర్ కు మొదటి, రెండో బౌమతులు, మెమంటోలు ఇస్తామని, డుమ్మాలు కొట్టకుండా నిబ్బద్దతో పని చేసే టీచర్లను, ఆయాలను సత్కరిస్థామన్నారు. విచ్చేసే అధిధులకు స్కూల్ కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్ స్వాగతం పలుకుతారు. టీచర్లు స్కూల్ యాన్వల్ రిపోర్ట్ చదివి విన్పిస్తారు. చదువే కాకుండా స్కూల్ లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు, స్మార్ట్ బోర్డులు, విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాట్లు చేశామని, విశాలమైన గ్రోండ్ లో పిల్లలకు అన్నిరకాల క్రీడల్లో శిక్షణనిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ స్టూడెంట్ ఫెస్ట్ లో విద్యార్థుల చేత కూపన్లు విక్రహించి ఫుడ్, అండ్ గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన డబ్బుల్లో కొంతబాగాన్ని అనాధ శరణాలయాలకు అందజేయనున్నారు. వివిధ బాస్కెట్ బాల్, వాలీబాల్, త్రో బాల్స్, స్కెటింగ్ వంటి పోటిల్లో రా ణించిన వారికీ బౌహుమతులు అందజేస్తారు. డ్యాన్సింగ్, సింగింగ్ వంటి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరల్డ్ సేఫ్టీ డే అండ్ హెల్త్ ఎట్ వర్క్ సందర్బంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ నేషనల్ లెవల్ లో పాల్గొన్న టీచర్లు చిత్ర లేఖ కు మొదటి బౌమతి రాగా, థర్డ్ ప్రైజ్ యోగితా సాధించి తమ స్కూల్ పేరు నిలబెట్టారు.కూపన్లు లక్కీ డ్రా తీసి అందులో వచ్చిన వారికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు అందజేస్తారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

13 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago