_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
_టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ పై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులను ఫోటోగ్రాఫర్లకు అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి.శ్రీనివాస్, రాష్ట్ర సంఘము కోశాధికారి మునగాల శైలేందర్, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్ , ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్, కోశాధికారి గడ్డం లక్ష్మా రెడ్డి, స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…