_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
_టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ పై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులను ఫోటోగ్రాఫర్లకు అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి.శ్రీనివాస్, రాష్ట్ర సంఘము కోశాధికారి మునగాల శైలేందర్, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్ , ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్, కోశాధికారి గడ్డం లక్ష్మా రెడ్డి, స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…