మహిళలలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం _బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి

– యువత డ్రగ్స్, మద్యానికి అలవాటు

-మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

మనవార్తలు ,ఆమీన్పూర్

రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ రాక్షస పాలనను మహిళలతో కలిసి రూపుమాపుతామని, టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండ‌లం బీరంగూడ గుట్టపై కౌన్సిలర్లు ఎడ్ల సంధ్య రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పాల్గొని మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని ఒక్క రోజు కాకుండా వారం రోజుల పాటు నిర్వహించుకోవాలని బీజేపీ నిర్ణయించిందని అందులో భాగంగా మహిళలతో ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడం పట్ల ఎడ్ల సంధ్య రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.

 

కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మారిందన్నారు. మద్యానికి బానిసలుగా మారి వావివరుసలు మరిచి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అధికమయ్యాయని వాపోయారు. తెలంగాణలో యువత డ్రగ్స్ కు అలవాటుపడడం, మద్యానికి బానిసై సమాజం చెడిపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు  రక్షణ లేకుండా పోయిందన్నారు.

నేటి సమాజంలో మహిళలు ప్రతి రంగంలో వివక్షతకు గురవుతూనే ఉన్నారని, వివక్షతను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూపీ ఎన్నికల్లో అధికంగా మహిళలు వేసిన ఓట్ల ద్వారానే యోగి విజయం సాధించారన్నారు. తెలంగాణలోనూ మహిళల ప్రతాపం చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా జిల్లా ఇంచార్జీ జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్థన్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్ మాధురి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, నాయకులు గోదావరి అంజిరెడ్డి, జగన్, బైండ్ల కుమార్, సహదేవ్, శ్యామల, పద్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago