మనవార్తలు ,జిన్నారం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి బదులుగా పూర్తి గా క్వాలిటీ లేని డస్ట్ వాడుతున్నారని. అందువల్ల కట్టే సమయంలోనే బూడిది లా రాలి పోతుందని అన్నారు. ఈ విషయం పై అధికారులను 17 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు కేటాయించిన ఎందుకు పనిలో నాణ్యత ఉండటం లేదని నిలదీయగా పనులు జరుగుతున్నాయి కదా వాటికోసం మీకు ఎందుకు అని కౌన్సిలర్ అయ్యిన నాకు నిర్లక్ష్యంగా బడులిస్తునారు అని మండిపడ్డారు.వెంటనే ఈ పనులను మున్సిపల్ అధికారులు పరిశీలించి పనుల్లో నాణ్యత తీసుకునేటట్లు చూడాలని లేదంటే పనులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…