మనవార్తలు ,రామచంద్రాపురం
పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఫీవర్ సర్వే పూర్తవుతుందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి హోం ఇసోలేషన్ కిట్లు అందించడంతోపాటు, పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే తీరును వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…