Districts

పటేల్ గూడ నూతన గ్రామపంచాయతీ ప్రారంభం

కెసిఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి నిరాదరణకు గురైన గ్రామ పంచాయతీలు నేడు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ట్రాక్టరు, ట్యాంకర్, ప్రతినెల నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకునీ వెళుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలతో పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు తొలగించి ఆధునిక హంగులతో భవనాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని అన్నారు.

గ్రామస్థాయిలో సర్పంచులు ప్రతిరోజు ఉదయం గ్రామంలో పర్యటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నప్పుడే సమస్యలు తెలుస్తాయని, ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 67 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నీతిశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago