Districts

పటేల్ గూడ నూతన గ్రామపంచాయతీ ప్రారంభం

కెసిఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి నిరాదరణకు గురైన గ్రామ పంచాయతీలు నేడు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ట్రాక్టరు, ట్యాంకర్, ప్రతినెల నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకునీ వెళుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలతో పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు తొలగించి ఆధునిక హంగులతో భవనాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని అన్నారు.

గ్రామస్థాయిలో సర్పంచులు ప్రతిరోజు ఉదయం గ్రామంలో పర్యటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నప్పుడే సమస్యలు తెలుస్తాయని, ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 67 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నీతిశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago