సమాన హక్కుల కోసం నిలబడండి…

– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా

మనవార్తలు ,పటాన్ చెరు:

స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . రామలక్ష్మితో కలిసి ఆమె హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు . ‘ స్థిరమైన భవిష్యత్తు కోసం లింగ సమానత్వాన్ని పాటించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , లింగ సమానత్వం ఆవశ్యకతను నొక్కిచెప్పారు .

మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలన్నారు . మహిళలను ఎక్కడికంటే అక్కడకు , ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినివ్వకుండా నియంత్రించం సరికాదని , అది స్త్రీ స్వేచ్ఛను హరించడమేనని ఆమె స్పష్టీకరించారు . ప్రజా రవాణాలో మహిళలను తాకడం సరికాదని , అది ఆ మహిళపై జరిగిన వ్యక్తిగత దాడిగానే ఆమె అభివర్ణించారు . ఏ రకమైన దుస్తులు ధరించాలనేది ఆయా మహిళల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని , దానిపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె ఖండించారు .

మహిళల భద్రత కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిన్హా పిలుపునిచ్చారు . నిత్యజీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న వైరుధ్యాలను రామలక్ష్మి ఏకరువు పెట్టారు . మనదేశంలో మహిళా శ్రామిక శక్తి 27 శాతం మాత్రమేనని , అది పురుషులతో సమాన స్థాయికి చేరినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదుగుతామన్నారు . తల్లి పాల ఆవశ్యకతను ఆమె గుర్తుచేస్తూ , కనీసం పది నెలలపాటు తల్లి పాలు ఇవ్వాలని స్పష్టీకరించారు .మహిళలకు పని ప్రదేశాలలో బిడ్డలకు పాలిచ్చే సౌకర్యంతో పాటు వారు ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లు చేయాలని , జననం సమయంలో తండ్రికి కూడా సెలవు మంజూరు చేయాలని ఆమె సూచించారు .

ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసే ఆమె పలు అనుభవాలను ఈ సందర్భంగా ఉటంకించారు . మహిళా సాధికారత ఎక్కడ ఉంటుందో , వారి మాటలను ఎక్కడ గౌరవిస్తారో , వారిని ఎక్కడ బాగా చూసుకుంటారో ఆ దేశం పురోగమిస్తుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . ప్రతి ఒక్కరి జీవితంలోని ఐదుగురు మహిళలు- తల్లి , సోదరి , సహచరి , కుమార్తె , గురువుల ప్రాముఖ్యతను గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరిస్తూ , వారిని అందరూ , అన్నివేళలా గౌరవించాలని సూచించారు . గీతం మహిళా సాధికారిత కమిటీ సమన్వయకర్తలు డాక్టర్ ఎన్.ప్రసన్నలక్ష్మి అతిథులను స్వాగతించగా , డాక్టర్ కె.తేజస్విని వందన సమర్పణ చేశారు . కళాకృతి బృందం , ముఖ్యంగా బృంద నాయకురాలు లలిత సింధూరి , జీఎస్చ్ఎస్ అధ్యాపకులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించడమేగాక , అతిథుల ప్రత్యేక ప్రశంసలనందుకున్నాయి .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago