– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా
మనవార్తలు ,పటాన్ చెరు:
స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . రామలక్ష్మితో కలిసి ఆమె హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు . ‘ స్థిరమైన భవిష్యత్తు కోసం లింగ సమానత్వాన్ని పాటించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , లింగ సమానత్వం ఆవశ్యకతను నొక్కిచెప్పారు .
మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలన్నారు . మహిళలను ఎక్కడికంటే అక్కడకు , ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినివ్వకుండా నియంత్రించం సరికాదని , అది స్త్రీ స్వేచ్ఛను హరించడమేనని ఆమె స్పష్టీకరించారు . ప్రజా రవాణాలో మహిళలను తాకడం సరికాదని , అది ఆ మహిళపై జరిగిన వ్యక్తిగత దాడిగానే ఆమె అభివర్ణించారు . ఏ రకమైన దుస్తులు ధరించాలనేది ఆయా మహిళల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని , దానిపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె ఖండించారు .
మహిళల భద్రత కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిన్హా పిలుపునిచ్చారు . నిత్యజీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న వైరుధ్యాలను రామలక్ష్మి ఏకరువు పెట్టారు . మనదేశంలో మహిళా శ్రామిక శక్తి 27 శాతం మాత్రమేనని , అది పురుషులతో సమాన స్థాయికి చేరినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదుగుతామన్నారు . తల్లి పాల ఆవశ్యకతను ఆమె గుర్తుచేస్తూ , కనీసం పది నెలలపాటు తల్లి పాలు ఇవ్వాలని స్పష్టీకరించారు .మహిళలకు పని ప్రదేశాలలో బిడ్డలకు పాలిచ్చే సౌకర్యంతో పాటు వారు ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లు చేయాలని , జననం సమయంలో తండ్రికి కూడా సెలవు మంజూరు చేయాలని ఆమె సూచించారు .
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసే ఆమె పలు అనుభవాలను ఈ సందర్భంగా ఉటంకించారు . మహిళా సాధికారత ఎక్కడ ఉంటుందో , వారి మాటలను ఎక్కడ గౌరవిస్తారో , వారిని ఎక్కడ బాగా చూసుకుంటారో ఆ దేశం పురోగమిస్తుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . ప్రతి ఒక్కరి జీవితంలోని ఐదుగురు మహిళలు- తల్లి , సోదరి , సహచరి , కుమార్తె , గురువుల ప్రాముఖ్యతను గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరిస్తూ , వారిని అందరూ , అన్నివేళలా గౌరవించాలని సూచించారు . గీతం మహిళా సాధికారిత కమిటీ సమన్వయకర్తలు డాక్టర్ ఎన్.ప్రసన్నలక్ష్మి అతిథులను స్వాగతించగా , డాక్టర్ కె.తేజస్విని వందన సమర్పణ చేశారు . కళాకృతి బృందం , ముఖ్యంగా బృంద నాయకురాలు లలిత సింధూరి , జీఎస్చ్ఎస్ అధ్యాపకులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించడమేగాక , అతిథుల ప్రత్యేక ప్రశంసలనందుకున్నాయి .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…