Districts

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మార్పులు

– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

– ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు

మనవార్తలు , పటాన్ చెరు

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఈ సమావేశానికి విచ్చేసిన సాయిబాబు మాట్లాడుతు 37 సం౹౹ గా యూనియన్ ను ఐక్యంగా నిలబెట్టుకుంటూ అనితరసాధ్యమైన విజయాలు సాధించడమే కాక కార్మిక వర్గ చైతన్యం కోసం, హక్కులకొరకు జరిగే పోరాటాలు, పిలుపులు అమలులో అగ్రభాగాన ఉంటూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచే శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ కి అభినందనలు తెలియచేశారు.

ఈనెల 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మె ఎందుకు జరుగుతున్నదో, ముఖ్యంగా ఎలాంటి సందర్భంలో జరుగుతున్నదో కార్మికవర్గానికి తెలియజేయవసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని అన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు జరిగిన దేశవ్యాప్త సమ్మెలలో బిఎంఎస్ పాల్గొన్నదని రాజకీయ కారణాలతో వారు పాల్గొనకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని గుర్తు చేశారు. భారతదేశ మౌలిక వసతులకు సంబందించిన అన్ని వనరులను ప్రయివేటుకి అప్పజెప్పే నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ను గనుక అమలుచేస్తే, మౌలిక వసతులపై ప్రభుత్వం యొక్క నియంత్రణ లేకపోతే రవాణా, ఆరోగ్యం తోబాటు అన్ని భారాలు ప్రజలపై తీవ్రస్థాయిలో పడతాయని అన్నారు.

స్వాతంత్రానికి పూర్వమే మన పూర్వీకులు అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కరోనా లాక్ డౌన్ సమయంలో కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కి పంపకుండా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చడం జరిగిందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. లేబర్ కోడ్స్ పెట్టుబడులు పెరగటానికి, ఉపాధి పెరగటానికి తెచ్చామని ప్రభుత్వం చెబుతోందని కానీ యజమానుల లాభాలు పెరగడానికి, కార్మికుల ప్రయోజనాలు తగ్గించడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయని చెప్పారు. 8 గం. పని, ఓటి, సమ్మె చేసేహక్కు, ఈఎస్ఐ. పీఎఫ్ లాంటి హక్కులు ప్రశ్నార్థకమవుతాయని, కార్మికవర్గం తిరిగి బానిసత్వంలోకి నెట్టబడతారని ఆయన వాపోయారు.

కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10 వేలు ఇవ్వాలని, ప్రజల ఆస్తులను ప్రయివేటు కి ధారాదత్తం చేసే డీమోనిటైజేషన్ పైప్ లైన్ ను ఉపసంహరించాలని, ఇంకా అనేక డిమాండ్స్ చేస్తూ జరిగే రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో కార్మికవర్గం జెండాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు, ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

 

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago