Districts

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మార్పులు

– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

– ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు

మనవార్తలు , పటాన్ చెరు

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఈ సమావేశానికి విచ్చేసిన సాయిబాబు మాట్లాడుతు 37 సం౹౹ గా యూనియన్ ను ఐక్యంగా నిలబెట్టుకుంటూ అనితరసాధ్యమైన విజయాలు సాధించడమే కాక కార్మిక వర్గ చైతన్యం కోసం, హక్కులకొరకు జరిగే పోరాటాలు, పిలుపులు అమలులో అగ్రభాగాన ఉంటూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచే శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ కి అభినందనలు తెలియచేశారు.

ఈనెల 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మె ఎందుకు జరుగుతున్నదో, ముఖ్యంగా ఎలాంటి సందర్భంలో జరుగుతున్నదో కార్మికవర్గానికి తెలియజేయవసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని అన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు జరిగిన దేశవ్యాప్త సమ్మెలలో బిఎంఎస్ పాల్గొన్నదని రాజకీయ కారణాలతో వారు పాల్గొనకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని గుర్తు చేశారు. భారతదేశ మౌలిక వసతులకు సంబందించిన అన్ని వనరులను ప్రయివేటుకి అప్పజెప్పే నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ను గనుక అమలుచేస్తే, మౌలిక వసతులపై ప్రభుత్వం యొక్క నియంత్రణ లేకపోతే రవాణా, ఆరోగ్యం తోబాటు అన్ని భారాలు ప్రజలపై తీవ్రస్థాయిలో పడతాయని అన్నారు.

స్వాతంత్రానికి పూర్వమే మన పూర్వీకులు అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కరోనా లాక్ డౌన్ సమయంలో కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కి పంపకుండా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చడం జరిగిందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. లేబర్ కోడ్స్ పెట్టుబడులు పెరగటానికి, ఉపాధి పెరగటానికి తెచ్చామని ప్రభుత్వం చెబుతోందని కానీ యజమానుల లాభాలు పెరగడానికి, కార్మికుల ప్రయోజనాలు తగ్గించడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయని చెప్పారు. 8 గం. పని, ఓటి, సమ్మె చేసేహక్కు, ఈఎస్ఐ. పీఎఫ్ లాంటి హక్కులు ప్రశ్నార్థకమవుతాయని, కార్మికవర్గం తిరిగి బానిసత్వంలోకి నెట్టబడతారని ఆయన వాపోయారు.

కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10 వేలు ఇవ్వాలని, ప్రజల ఆస్తులను ప్రయివేటు కి ధారాదత్తం చేసే డీమోనిటైజేషన్ పైప్ లైన్ ను ఉపసంహరించాలని, ఇంకా అనేక డిమాండ్స్ చేస్తూ జరిగే రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో కార్మికవర్గం జెండాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు, ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

 

 

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago