సమాన హక్కుల కోసం నిలబడండి…

– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా

మనవార్తలు ,పటాన్ చెరు:

స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . రామలక్ష్మితో కలిసి ఆమె హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు . ‘ స్థిరమైన భవిష్యత్తు కోసం లింగ సమానత్వాన్ని పాటించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , లింగ సమానత్వం ఆవశ్యకతను నొక్కిచెప్పారు .

మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలన్నారు . మహిళలను ఎక్కడికంటే అక్కడకు , ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినివ్వకుండా నియంత్రించం సరికాదని , అది స్త్రీ స్వేచ్ఛను హరించడమేనని ఆమె స్పష్టీకరించారు . ప్రజా రవాణాలో మహిళలను తాకడం సరికాదని , అది ఆ మహిళపై జరిగిన వ్యక్తిగత దాడిగానే ఆమె అభివర్ణించారు . ఏ రకమైన దుస్తులు ధరించాలనేది ఆయా మహిళల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని , దానిపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె ఖండించారు .

మహిళల భద్రత కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిన్హా పిలుపునిచ్చారు . నిత్యజీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న వైరుధ్యాలను రామలక్ష్మి ఏకరువు పెట్టారు . మనదేశంలో మహిళా శ్రామిక శక్తి 27 శాతం మాత్రమేనని , అది పురుషులతో సమాన స్థాయికి చేరినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదుగుతామన్నారు . తల్లి పాల ఆవశ్యకతను ఆమె గుర్తుచేస్తూ , కనీసం పది నెలలపాటు తల్లి పాలు ఇవ్వాలని స్పష్టీకరించారు .మహిళలకు పని ప్రదేశాలలో బిడ్డలకు పాలిచ్చే సౌకర్యంతో పాటు వారు ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లు చేయాలని , జననం సమయంలో తండ్రికి కూడా సెలవు మంజూరు చేయాలని ఆమె సూచించారు .

ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసే ఆమె పలు అనుభవాలను ఈ సందర్భంగా ఉటంకించారు . మహిళా సాధికారత ఎక్కడ ఉంటుందో , వారి మాటలను ఎక్కడ గౌరవిస్తారో , వారిని ఎక్కడ బాగా చూసుకుంటారో ఆ దేశం పురోగమిస్తుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . ప్రతి ఒక్కరి జీవితంలోని ఐదుగురు మహిళలు- తల్లి , సోదరి , సహచరి , కుమార్తె , గురువుల ప్రాముఖ్యతను గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరిస్తూ , వారిని అందరూ , అన్నివేళలా గౌరవించాలని సూచించారు . గీతం మహిళా సాధికారిత కమిటీ సమన్వయకర్తలు డాక్టర్ ఎన్.ప్రసన్నలక్ష్మి అతిథులను స్వాగతించగా , డాక్టర్ కె.తేజస్విని వందన సమర్పణ చేశారు . కళాకృతి బృందం , ముఖ్యంగా బృంద నాయకురాలు లలిత సింధూరి , జీఎస్చ్ఎస్ అధ్యాపకులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించడమేగాక , అతిథుల ప్రత్యేక ప్రశంసలనందుకున్నాయి .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago