పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే క్రీడా స్ఫూర్తిగా పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ద్వితీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుపై చూపిన శ్రద్ధ క్రీడలపై కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడారంగంలో భారతీయుల పాత్ర అతి తక్కువగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోనూ మినీ స్టేడియాలతో పాటు క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…