పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే క్రీడా స్ఫూర్తిగా పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ద్వితీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుపై చూపిన శ్రద్ధ క్రీడలపై కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడారంగంలో భారతీయుల పాత్ర అతి తక్కువగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోనూ మినీ స్టేడియాలతో పాటు క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…