Telangana

డబుల్ బెడ్ రూం ఇళ్ళు చాలా వరకు శిధిలావస్థకు చేరుకున్నాయి : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. నాణ్యత లోపంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు పూర్తి కాకుండానే మరుగునపడ్డాయని పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. పటాన్ చెరు పరిధిలోని చిట్కూల్ గ్రామంలోె డబుల్ బెడ్ రూం ఇండ్లను గడీల శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు . అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పాలన పూర్తయిన పార్టీ నిర్లక్ష్యం కారణంగా డబుల్ బెడ్ రూంలు కట్టిన వాటిని లబ్దిదారులకు కేటాయించలేదని పర్యవేక్షణలోపం కారణంగా శిధిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు .

సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గానికి వచ్చి ప్రగల్బాలు పలుకుతూ తూతూ మంత్రంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభించారని …పెండింగ్ లో ఉన్న వాటి గురించి మాట్లాడలేదన్నారు . ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యే ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవాచేశఆరు . బీసీ బంధు ,మైనార్టీ బంధు ,దళిత బంధు పేరుతో అంటూ అబద్దపు ప్రచారాలు మానుకుని డబుల్ బెడ్ రూంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మేలుకొని నియోజకవర్గ స్థాయిలో ఉన్న పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు . పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున పోరాడి ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్ , జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ,భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ , పటాన్ చేరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు , జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, జిల్లా కిసాన్ మొర్చా నాయకుడు వీరారెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డి,మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జోగు ధన్ రాజ్,బిజేవైయం పటాన్ చెరు అసెంబ్లీ కన్వీనర్ రాజ్ గోపాల్ యాదవ్, యస్.ఆర్.కే‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago