Telangana

యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో నూతన సంవత్సర డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీలను బుధవారం రాత్రి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం యువతలో విశేష ఉత్సాహాన్ని నింపుతూ ఘనంగా సాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ నేటి యువత సమాజ భవిష్యత్తు అని, వారిని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత సమాజం మొత్తంపై ఉందని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలిలో యువత మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు, తప్పుదోవ పట్టే అంశాల వైపు ఆకర్షితులు కాకుండా ఉండాలంటే క్రీడలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా క్రీడా పోటీలను నిర్వహిస్తూ యువతను క్రీడల వైపు మళ్లిస్తున్న మైత్రి క్రికెట్ క్లబ్ నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. యువత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడల ద్వారా తమ ప్రతిభను వెలికి తీసుకోవాలని, భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించే అవకాశాలు ఉన్నాయని ఆయన యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.క్రీడలు యువతను ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా, సామాజిక బాధ్యతను నేర్పుతాయని, గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవాటు చేస్తాయని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ పరంగా కూడా యువత, క్రీడాకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ మెట్టుకు కుమార్ యాదవ్ మాట్లాడుతూ పటాన్‌చెరులో యువత సంఖ్య అధికంగా ఉండటం గర్వకారణమని, అలాంటి యువతను క్రీడల ద్వారా సానుకూల దిశలో నడిపించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని అన్నారు. మాజీ కార్పొరేటర్లు శ్రీ శంకర్ యాదవ్ , శ్రీ సపాన దేవ్ , మాజీ ఎంపీపీ శ్రీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే యువతకు నేడు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సీనియర్ నాయకులు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి , శ్రీ రామచంద్రారెడ్డి , శ్రీ నరసింహారెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ, క్రీడలు యువతను ఐక్యతగా నిలబెడతాయని, సామాజిక సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మైదానం కిక్కిరిసిపోయింది. ఈ డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు పటాన్‌చెరు ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తిని మరింత పెంపొందిస్తూ, సమాజానికి సానుకూల సందేశాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago