Telangana

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి _ప్రొఫెసర్ డీ.ఎస్. రావు

అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అభిరుచికి తగ్గ కోర్సులను ఎంపిక చేసుకుని, అందులో రాణించి, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు సూచించారు. అవినాష్ కళాశాల కూకట్ పల్లి, ఎల్.బీ.నగర్, హయత్ నగర్, సికింద్రాబాద్ శాఖలకు చెందిన దాదాపు 750 మంది విద్యార్థుల బృందం శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించింది.ఆహ్లాదకరమైన వాతావరణంలో గీతం ప్రోవీసీ అవినాష్ విద్యార్థులను స్వాగతించి, ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు చెందిన అన్ని అంశాలను స్వయంగా పరిశీలించి కూలంకషంగా తెలుసుకోవాలని సూచించారు.

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా బీ-స్కూల్ గురించి లోతైన అవగాహన కల్పించారుచడమే గాక, అక్కడున్న బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాల గురించి వివరించారు. అవినాష్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆకట్టుకునే జవాబులిచ్చి వారిని ఉత్సాహపరిచారు. గీతం బీ-స్కూల్ ఎంబీ ఏ చివరి సంవత్సరం విద్యార్థులతో అవినాష్ బృందం ముఖాముఖి సమావేశమై, వివిధ కెరీర్ ఎంపికలు, భవిష్యత్తు అవకాశాల గురించి ప్రత్యక్ష జ్జానాన్ని అందించారు.ఆ తరువాత, కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె. మమత వారితో సమావేశమై, ప్రాంగణ నియామకాలు, దానికి సన్నాహకంగా గీతంలో ఇచ్చే శిక్షణ, దానిని విజయవంతంగా పూర్తిచేసుకుని వివిధ కంపెనీలకు ఎంపికైన వారు పొందుతున్న జీతభత్యాల వివరాలను తెలిపారు.

ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగిన గీతం సందర్శన, ముఖాముఖి చర్చలు, స్వయంగా పరిశీలించే వెసులుబాటు వంటివి అవినాష్ విద్యార్థులకు విస్తృతమైన అవగాహనను ఏర్పరచడమే గాక, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి తోడ్పడింది. దీనికి అదనంగా గీతంలోని బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన పలు ప్రయోగశాలలు, ఆకట్టుకునే ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సదుపాయాలు అవినాష్ విద్యార్థుల ఆసక్తిని రెట్టింపు చేశాయి. పసందైన విందుతో ముగిసిన ఈ పర్యటన, పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి చర్చించడంతో పాటు వారితో పరిచయాలు ఏర్పరచుకోవడానికి వీలు కల్పించింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago