అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అభిరుచికి తగ్గ కోర్సులను ఎంపిక చేసుకుని, అందులో రాణించి, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు సూచించారు. అవినాష్ కళాశాల కూకట్ పల్లి, ఎల్.బీ.నగర్, హయత్ నగర్, సికింద్రాబాద్ శాఖలకు చెందిన దాదాపు 750 మంది విద్యార్థుల బృందం శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించింది.ఆహ్లాదకరమైన వాతావరణంలో గీతం ప్రోవీసీ అవినాష్ విద్యార్థులను స్వాగతించి, ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు చెందిన అన్ని అంశాలను స్వయంగా పరిశీలించి కూలంకషంగా తెలుసుకోవాలని సూచించారు.
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా బీ-స్కూల్ గురించి లోతైన అవగాహన కల్పించారుచడమే గాక, అక్కడున్న బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాల గురించి వివరించారు. అవినాష్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆకట్టుకునే జవాబులిచ్చి వారిని ఉత్సాహపరిచారు. గీతం బీ-స్కూల్ ఎంబీ ఏ చివరి సంవత్సరం విద్యార్థులతో అవినాష్ బృందం ముఖాముఖి సమావేశమై, వివిధ కెరీర్ ఎంపికలు, భవిష్యత్తు అవకాశాల గురించి ప్రత్యక్ష జ్జానాన్ని అందించారు.ఆ తరువాత, కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె. మమత వారితో సమావేశమై, ప్రాంగణ నియామకాలు, దానికి సన్నాహకంగా గీతంలో ఇచ్చే శిక్షణ, దానిని విజయవంతంగా పూర్తిచేసుకుని వివిధ కంపెనీలకు ఎంపికైన వారు పొందుతున్న జీతభత్యాల వివరాలను తెలిపారు.
ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగిన గీతం సందర్శన, ముఖాముఖి చర్చలు, స్వయంగా పరిశీలించే వెసులుబాటు వంటివి అవినాష్ విద్యార్థులకు విస్తృతమైన అవగాహనను ఏర్పరచడమే గాక, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి తోడ్పడింది. దీనికి అదనంగా గీతంలోని బ్లూమ్ బెర్గ్ వంటి అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన పలు ప్రయోగశాలలు, ఆకట్టుకునే ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సదుపాయాలు అవినాష్ విద్యార్థుల ఆసక్తిని రెట్టింపు చేశాయి. పసందైన విందుతో ముగిసిన ఈ పర్యటన, పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి చర్చించడంతో పాటు వారితో పరిచయాలు ఏర్పరచుకోవడానికి వీలు కల్పించింది.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…