మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లేశం బెల్జికి భారత శాస్త్ర , సాంకేతిక పరిశోధన మండలి ( సెర్చ్ ) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది . ఈ విషయాన్ని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ‘ లిగ్నో సెల్యులోజ్నీ లిగ్నిన్- ఉత్పన్న రసాయనాలుగా మార్చడానికి నూతన , సమర్థ ఉత్ప్రేరక వ్యూహాలను రూపొందించడానికి ‘ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సెర్చ్ తగిన పాలనా అనుమతులతో పాటు రూ .33 లక్షల గ్రాంటును మంజూరు చేసిందని , రెండేళ్ళ వ్యవధిలో దీనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు . ఈ పరిశోధనలో సాయపడేందుకు గాను ప్రాజెక్టు ఫెలో ( జేఆర్ఎఫ్ ) అవసరం ఉందని , ఎమ్మెస్సీ కెమిస్ట్రీ / అప్లయిడ్ కెమిస్ట్రీ / మెటీరియల్ సెన్స్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని , సీఐఎస్ఆర్ – యూఐసీ – నెట్ / గేట్ / డీబీటీ / ఐసీఎంఆర్ అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు . ఇతర వివరాల కోసం 9966 9988 52 ను సంప్రదించాలి లేదా mbaithy@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు . సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు పొందిన డాక్టర్ మల్లేశంను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం , హెదరాబాద్ ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ , పలువురు అధ్యాపకులు , యూజీసీ వ్యవహారాల సమన్వయకర్త తదితరులు అభినందించి , గడువులోగా పరిశోధనను పూర్తిచేయమని సలహా ఇచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
గీతమ్లో ఘనంగా గాంధీ జయంతి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ విశిష్ట అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఏ రామారావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ , హార్టికల్చర్ అధికారి శరత్ బాబు తదితరులు గాంధీ స్క్వేర్లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…