Telangana

సర్పంచ్ బొడ్డు జగన్ తో సహా భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

_పోచారంలో కాంగ్రెస్ ఖాళీ..

_అభివృద్ధి మా అజెండా.. సంక్షేమమే మా ధ్యేయం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారబోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు జగన్, వార్డు సభ్యులు విజయ, నర్సమ్మ, యాదగిరి, లక్ష్మి, సుమారు 300 మంది అనుచరులతో కలిసి ఆదివారం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జెండా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమా చేపడుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, కోడూరి బిక్షపతి, తలారి బిక్షపతి, ఉప సర్పంచ్ రాజు, ఆంజనేయులు, యాదయ్య, కిష్టయ్య, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago