Telangana

కిష్టారెడ్డిపేట గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు అచ్చిన వ్యయంతో మన ఊరు మనబడి పనులు ప్రారంభం

_మన ఊరు మన బడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా పోటీ పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు అభివృద్ధి పనులకు బుధవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటి పది లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని మరో కోటి రూపాయలు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 55 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం జీర్ణోధారణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.పటేల్ గూడ గ్రామ పరిధిలోని హరివిల్లు టౌన్షిప్లో హనుమాన్ దేవాలయం నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, గ్రామ సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్, పటేల్ గూడ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago