మనవార్తలు ,పటాన్ చెరు:
అల్యూమినియం ఆధారిత మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాల యాంత్రిక , అలసట ప్రవర్తన ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని పి.సరితను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . విమాన నిర్మాణాలలో విస్తృతంగా వినియోగించే 7075 వంటి అల్యూమినియం మిశ్రమాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువని , ఇది విమాన నిర్మాణ సమగ్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు . ఎందుకంటే , తుప్పు గుంటల నుంచి న్యూక్లియేట్ అయి , ప్రతికూల వాతావరణంలో వేగవంతంగా పెరుగుతాయన్నారు .
దీనివల్ల అనేక ఇంజనీరింగ్ యంత్రాలు , మెకానికల్ భాగాలు హెచ్చుతగ్గుల ఒత్తిడికి లోనవుతాయని , సాపేక్షంగా అధిక పౌనఃపున్యాల వద్ద జరుగుతాయని ఆమె తెలిపారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ఏఎల్ 7075 తో మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాలను బేస్ మెటల్గా , జిర్మోనియం ఉపబలాలను తగు నిష్పత్తిలో వైవిధ్యంగా రూపొందించేందుకు ప్రయత్నించామన్నారు . వాటికి సిలికాన్ కార్బెడ్ , మాలిబ్డినం డెస్టల్నెడ్ స్టెర్డ్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించి , స్థిరత్వాన్ని కల్పించినట్టు తెలియజేశారు .
సరిత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…