శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
:తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నంగా నిలుస్తుందని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గంగిరెద్దులతో డు బసవన్నలు ఆడిస్తూ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరం తొలి నెలలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు పండగ ప్రాముఖ్యతను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా తెలుగువారి లోగిళ్ళ ముందు అందమైన రంగవల్లులతో అలంకరిస్తారు. అలా పిల్లలను చిన్నప్పటినుండి మన తెలుగు పండుగల గురించి, వాటి ఔన్నత్యాన్ని తెలియజేయడం మన బాధ్యత అని ఉమామహేశ్వరి అన్నారు. ముందు ముందు కూడా పెరుగుతున్న పాశ్చాత ధోరణికి అనుగుణంగా తెలుగు పండుగలను కూడా జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…