Telangana

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా_సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ బాల మురళీకృష్ణ (చిన్న ముదిరాజ్)

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటన్ చెరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు, పటాన్ చెరు మండలంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు, అందుకుగాను తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బాల మురళీకృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు, శనివారం రోజు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు చేతుల మీదుగా అందుకున్నారు, ఈ సందర్భంగా బాల మురళీకృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం జరిగే సాధారణ ఎన్నికలలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రసన్న కుమార్, అరుణ్ గౌడ్, విజయ్, అరుణ్ యాదవ్, అడ్డు, శ్రీనివాస్, తుల్జారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago