పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటన్ చెరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు, పటాన్ చెరు మండలంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు, అందుకుగాను తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బాల మురళీకృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు, శనివారం రోజు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు చేతుల మీదుగా అందుకున్నారు, ఈ సందర్భంగా బాల మురళీకృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం జరిగే సాధారణ ఎన్నికలలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రసన్న కుమార్, అరుణ్ గౌడ్, విజయ్, అరుణ్ యాదవ్, అడ్డు, శ్రీనివాస్, తుల్జారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…