Telangana

గీతమ్ లో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవ వేడుకలు

_సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన 23 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యునూనిటీస్లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనదేశంలోని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉద్భవించిన భారతీయ శాస్త్రీయ కళ అయిన కూచిపూడి నృత్య రూపానికి విద్యార్థులు నీరాజనాలర్పించారు. 2020లో ప్రారంభించిన ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న కూచిపూడి గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఈ వేడుకలలో 23 నుంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం బ్రహ్మాంజలి, జతిస్వరం సహా విశేషమైన ప్రదర్శనల మేళవింపుతో సాగింది. కూచిపూడి చరిత్ర, సారాంశం, ప్రాముఖ్య, తను పరిశోధించే పది నిమిషాల చలనచిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ శాస్త్రీయ కళ ఆనందం. తాండనాన్ని ఈ సంక్షిప్త చిత్రం విపులీకరించింది.

ఈ వెంపటి పెద సత్యం ఒక తెలుగు చలనచిత్రం కోసం మొదట కొరియోగ్రఫీ చేసిన ‘ఏరువాక సాగారో’ అనే జానపద సంగీత ప్రదర్శన ఈ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రదర్శన కూచిపూడి గురువులు తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన నిస్వార్థ సేవకు నివాలి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వె.లలిత సింధూరి ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ డాక్టర్ సన్నీ జోస్, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ డీఆర్: చంద్రశేఖర్, ఫెస్ట్ ఆర్ట్స్ విభాగం సమన్వకర్త డాక్టర్ మెథైలి అనూస్ సహా పలువురు విశిష్ట వ్యక్తుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి.ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం హెదరాబాద్ లో శాస్త్రీయ నృత్యం యొక్క గొప్ప సంప్రదాయాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది అని డాక్టర్ సన్నీ జోస్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి కళారూపాన్ని సరిరక్షించడం, ప్రచారం చేయడంలో తామూ పాలుపంచుకుంటున్నందుకు గర్విస్తున్నామన్నారు. నందిని, విదుషి, సుప్రీత, ఇందీవర, మధుమిత, ఆన్ మరియా, శృతి, స్పందన, యామిని, అదితి, మాన్విత, భావన, తేజస్వి, తేజశ్రీ, ప్రణవ, పవిత్ర, పూజిత, మనోజ్ఞ, కనిష, భవ్య, హర్షిత, సుకృతి తదితరులు కూచిపూడి నత్యాలను ప్రదర్శించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago