Districts

ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి :

ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతణ నిర్వహించిన జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యాథి గా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్రoలో టీఆరెస్ ప్రభుత్వం ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటూ ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు.

హుజురాబాద్ ఎన్నికల అనంతరం జరిగే పరినామాలను పక్కదోవ పట్టించేందుకు కేంద్రం వడ్లు కొనడం లేదని, దొంగ దీక్షలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ ఏర్పడిందో దాన్ని తుoగలో తొక్కి కుటుంబ పాలన కొనసాగిస్తు నియంతలా వ్యవహారిస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికి, రాష్ట్ర ప్రభుత్వం వడ్లను సేకరించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కళ్లాల్లో వడ్లు పెట్టుకొని నిరీక్షిస్తున్నా పట్టించుకోకుండా వారిని ఆత్మహత్యలు చేసుకునేలా టీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

ఇక్కడ రైతులకు ఏమి చేయనోడు ఎక్కడో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తానని ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నాదాని వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి వారి బండారాన్ని ఎండగట్టేలా ప్రజలను చైతన్యo చేస్తామన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా రైతుల నుండి వడ్లు సేకరించకుండా ఇబ్బందులు పెట్టడం మంచిధికాదని హెచ్చరించారు. ఎన్నికల్లో హామిలివ్వడం తర్వాతమర్చిపోవడమే కేసీఆర్ నైజం అని తెలిపాడు.

ఓబీసీ జిలా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కమిటీలు వేసి, బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓబీసీ ని సంస్థాగతంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. అబద్దాలు ఆడిన వారికి అవార్డు లిస్తే అందులో కేసీఆర్ కు మొదటి బహుమతి వస్తుందన్నారు. ధర్నా చౌక్ ఏత్తెసి నాడు ధర్నా ఎలా చేస్తాడని ప్రశ్నించారు.

ఇక ప్రజలు కేసీఆర్ ను నమ్మరని, ఢిల్లీ కి పోయి పడిగాపులు కాస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఇంచార్జ్ ఎం.కోమరయ్య, ప్రధానకార్యదర్శి ఎస్.శ్రీశైలం కురుమ, ఎస్.వెంకటేష్, వి. దశరథ్ సాగర్, డి ఆర్ కె ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎం. స్వామి గౌడ్, ఎన్.నరేందర్ ముదిరాజ్, రఘు గౌడ్, జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, కార్యదర్శులు హరికిషన్ జి, జంగయ్య యాదవ్, మియపూర్ డివిజన్ నాయకులు మనిక్ రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, ఆంజనేయులు, డి.చందు, రవి గౌడ్, ప్రభాకర్ హఫీజ్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago