పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన గానంతో, ధూమ్ ధామ్ పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, గొప్ప నాయకుడిగా ఎదిగే క్రమంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో అంతా తానై తన పాటలతో ప్రజలందరినీ చైతన్యపరచడంతో పాటు, పటాన్చెరులో ఏ కార్యక్రమం నిర్వహించిన అన్న నేను వస్తానంటూ ఆప్యాయంగా కార్యక్రమాలకు హాజరయ్యే వాడని గుర్తు చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…