Telangana

పాశమైలారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

_నేటి తరానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ

_మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అదే స్ఫూర్తితో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ చౌరస్తాలో సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహనీయుల పోరాట చరిత్రను నేటి తరాలకు తెలియజేయ చెప్పాలన్న ఉద్దేశంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ఉద్యమకారులను నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సేవలను స్మరించుకుంటూ, వారి గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. పటాన్చెరులోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్ర శేకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago