స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి నిధులు సమకూర్చిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) కీలక ప్రకటన చేసింది. తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కరోనా నిరోధంలో 79.4 శాతం సామర్థ్యం చూపినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తర్వాత చేసిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. కొన్ని రెండు డోసుల వ్యాక్సిన్ కంటే దీని సామర్థ్యం చాలా మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది.
అలాగే ఇది అన్ని రకాల కరోనా వైరస్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని తెలిపింది. గమలేయా సెంటర్ నిర్వహించిన లేబోరేటరీ ప్రయోగాల్లో ఈ విషయం రుజువైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న సమయంలో సింగిల్ డోసు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం కీలకాంశం. ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్ అందించే అవకాశం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 21న స్పుత్నిక్ లైట్ సామర్థ్య పరీక్షలు ప్రారంభించిన గమలేయా మొత్తం 7000 మందిపై దీన్ని ప్రయోగించింది.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…