Telangana

భవిష్యత్తులో రోబోలు మనుషుల్లాగా ఉండొచ్చు!…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి ::

నాల్గవ తరం రోబోలు మానవ మానసిక శక్తితో సమానంగా రూపొందవచ్చని, అవి మేధోపరంగా బలీయులుగా మారే అవకాశం కూడా లేకపోలేదని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వోటీ) అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గీతమ్లో శుక్రవారం నిర్వహించిన ‘రోబోటిక్స్ వర్క్షాప్’, రోబోటిక్స్ అటానమస్ వెహికల్ క్లబ్ (ఆర్పీ)లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మెకానికల్ ఇంజనీరింగ్, అడ్మిషన్ల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూల ఉన్న 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన దాదాపు 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.భవిష్యత్తు విద్య నైపుణ్యాల ఆధారితంగా ఉంటుందని, అంతర్ విభాగ అవగాహనకు ప్రాముఖ్యత పెరుగుతుందని, పలు అంశాలపై నిపుణత సాధించి వారే నిలబడగలిగేలా ఉంటుందని ప్రొఫెసర్ సీతారామయ్య చెప్పారు. తయారీ రంగం, ప్యాకేజింగ్, ఆయుధాలు, భద్రత, వినియోగదారు-పారిశ్రామిక వస్తువుల భారీ ఉత్పత్తి మొదలైన వాటిలో రోబోలను విస్తృతంగా వినియోగిస్తున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని ప్రొఫెసర్ సీతారామయ్య సూచించారు.మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాస్ ఆ విభాగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజెప్పడంతో పాటు, అక్కడి మానవ-సాంకేతిక వనరులను విద్యార్థులు గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని హితబోధ చేశారు.

భవిష్యత్తు అంతా నెపుణ్యం ఆధారితంగా ఉంటుందని ప్రొఫెసర్ పి.ఈశ్వర్ చెప్పారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఏ. కిరణ్ కుమార్ వర్క్షాప్ లక్ష్యాలను వివరించారు. విద్యార్థి సమన్వయకర్తల వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.రోబోటిక్ కదలిక, దానిలోని వివిధ భాగాల ద్వారా మెకానిక్స్, ముఖ్యంగా రోబోట్ ఆర్మ్ గురించి వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తెలుసుకున్నారు. అలాగే సీఎన్సీ లేత్, సీఎన్సీ మిల్లింగ్, త్రీడీ ప్రింటింగ్ వంటి పలు అంశాలపై వారు ప్రాథమిక అవగాహన ఏర్పరచుకున్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

6 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

6 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

6 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

18 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

20 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago