Telangana

నేటి నుండి పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు

_3, 4 తేదీలలో మైత్రి మైదానం, జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో క్రీడా పోటీలు

6వ తేదీన జిఎంఆర్ లో ముగింపు కార్యక్రమాలు

_ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, డిఐజి సుమతి

_ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజుల పాటు పటాన్చెరు పట్టణంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు మైత్రి మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు.6వ తేదీ సోమవారం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాదిమంది మహిళలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై ప్రముఖులచే అవగాహన సదస్సులు, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్య స్థాయిల మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినులు, విద్యార్థినిలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago