Telangana

నేటి నుండి పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు

_3, 4 తేదీలలో మైత్రి మైదానం, జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో క్రీడా పోటీలు

6వ తేదీన జిఎంఆర్ లో ముగింపు కార్యక్రమాలు

_ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, డిఐజి సుమతి

_ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజుల పాటు పటాన్చెరు పట్టణంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు మైత్రి మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు.6వ తేదీ సోమవారం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాదిమంది మహిళలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై ప్రముఖులచే అవగాహన సదస్సులు, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్య స్థాయిల మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినులు, విద్యార్థినిలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago