Telangana

జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష సమావేశం

_అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_బల్దియాలో శరవేగంగా అభివృద్ధి పనులు 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల 3 డివిజన్లో పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామన్నారు.అభివృద్ధి పనుల అమల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు.అదేవిధంగా పెండింగ్ నిధుల మంజూరు, నూతన అభివృద్ధి పనుల నిధుల కోసం త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు.జాతీయ రహదారిపై విద్యుత్ దీపాల నిర్వహణ సంతృప్తికరంగా లేదంటూ సంభందిత శాఖ అధికారులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నూతన కాలనీలలో పారిశుధ్య నిర్వహణ కోసం నూతన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్ శాఖ ఈఈ శంకర్ నాయక్, డిప్యూటీ కమిషనర్ సురేష్, అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago