_వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_వృద్ధాశ్రమానికి ఐదు లక్షల రూపాయల విరాళం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని చివరి అంకంలో కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వృద్ధాశ్రమంలో చేరే వృద్ధుల ఆలనా పాలనా చూసేందుకు ఆశ్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోను సొంత నిధులతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహనకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, ప్రముఖ సినీ వ్యాఖ్యాత సుమ కనకాల, నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…