Telangana

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిని విధుల నుండి తొలగింపు

మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో

కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఒకరిని విధుల నుండి తొలగిస్తూ, మరో ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులుఅందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా వైద్యధికారిణి ని ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో డాక్టర్ అజ్మనాజ్ ను విధులను తొలగించాలని డిఎం అండ్ హెచ్ ఓ గాయత్రి దేవి కి ఆదేశించారు. దౌల్తాబాద్ ,మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే లో రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు కేసులో రెఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి సూచనలు సలహాలు, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి దేవి, జిజిహెచ్ సూపర్డెంట్ అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago