Telangana

నేటి తరం యువతకు ఆదర్శం రమేష్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కంటి చూపు లేకపోయినా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ కోర్సులు పూర్తి

దివ్యాంగుడి కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుతోపాటు,పెన్షన్ అందించిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కంటి చూపు లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా మొక్కవోని దీక్షతో గ్రాడ్యుయేషన్ తో పాటు మూడు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన దివ్యాంగుడు రమేష్ జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు పట్టణానికి చెందిన రమేష్ తొమ్మిదవ తరగతి చదివే సమయంలో కంటి చూపు కోల్పోయాడు. ఉన్నది చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నీరుగారిపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక రైల్వే ఉద్యోగి.. మైత్రి క్రికెట్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి రమేష్ పరిస్థితిని తెలుసుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో వెన్నంటి నిలిచారు. పదవ తరగతితో పాటు పటాన్చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ చదివేల ప్రోత్సహించి.. ఉత్తీర్ణత అయ్యేలా సహకరించారు. రైల్వే డిపార్ట్మెంట్లోని అంద ఉద్యోగుల సహకారంతో వివిధ కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసేలా కృషి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో దివ్యాంగుల కోటాలో. ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ పెన్షన్ అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రమేష్. తన ఉన్నతికి వెన్నంటి నిలుస్తూ సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..వితంలో ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం అంటే, మనం సాధించాలనుకున్నది ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడమణి.. ఈ అంశంలో రమేష్ కంటి చూపు లేకపోయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అకుంఠిత దీక్షతో పూర్తి చేశారని అభినందించారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా శిక్షణ ఇప్పించడంతోపాటు.. తాత్కాలికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రమేష్ విజయంలో శిక్షకుడిగా సహకారమందించిన మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డిని అభినందించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago