Telangana

ఎన్ సీసీ శిబిరాన్ని ప్రారంభించిన కల్నల్ రమేష్ సరియాల్

క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని క్యాడెట్లకు సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం నిర్వహిస్తున్న సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ-III) కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడుతూ, దీని నిర్వహణ కోసం మంచి వసతులను కల్పించడమే గాక, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన గీతం యాజమాన్యానికి కృతజ్జతలు తెలియజేశారు.క్యాడెట్లు కఠినమైన శిక్షణ పొందేందుకు, విలువైన జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒక వేదికగా ఇటువంటి శిబిరాలు ఉపకరిస్తాయని కల్నల్ సరియాల్ చెప్పారు. అంకితభావం, క్రమశిక్షణ, స్నేహ స్ఫూర్తితో మెలగాలని క్యాడెట్లకు సూచించారు. వ్యక్తులుగా మాత్రమే కాకుండా, దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇదో మంచి అవకాశంగా అభివర్ణించారు.

ప్రతి సవాలునూ స్వీకరించాలని, ప్రతి కార్యక్రమం నుంచి నేర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన అభిలషించారు.దేశభక్తి, నిస్వార్థ సేవల ప్రాధాన్యాన్ని క్యాడెట్లకు కల్నల్ సరియాల్ వివరిస్తూ, సూచనలను శ్రద్ధగా పాటించాలని, బాధ్యతలను విస్మరించుకూడదన్నారు. నాయకత్వం, క్రమశిక్షణ వంటివి సేవ చేయడానికి ముందుకు రావడంతో ఆరంభమవుతాయని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. డ్రిల్, శారీరక శిక్షణ (పీటీ), యోగా వంటి రోజువారీ కార్యక్రమాలతో పాటు ఆతిథ్య ఉపన్యాసాలు, సైద్ధాంతిక మాడ్యూళ్లను క్యాడెట్ల సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెప్పారు.

క్యాడెట్లంతా ఒకరితో మరొకరు సంభాషించుకోవాలని, కొత్త స్నేహాలను నిర్మించుకోవాలని, సామూహిక జీవన అనుభవాన్ని గౌరవించాలంటూ కల్నల్ సరియాల్ ప్రోత్సహించారు. జీవితం అనేక సవాళ్లను మన ముందు ఉంచుతుందని, స్థితిస్థాపకత, పరిపక్వత, సమష్టి కృషితో వాటిని అధిగమించి విజయాన్ని సాధించాలని సూచించారు.ఈ పది రోజుల శిబిరంలో, తెలంగాణ వ్యాప్తంగా 600 మంది క్యాడెట్లు పాల్గొంటుండగా, వారిలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, నిర్మాణాత్మక శిక్షణ, కార్యకలాపాల ద్వారా జీవితకాల విలువలను నిర్మించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ శిబిరం కల్పిస్తోంది.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సుబేదార్ మేజర్, అసోసియేట్ ఎన్ సీసీ ఆఫీసర్లు, తెలంగాణలోని ఎన్ సీసీ 9, 12, 32, 33వ బెటాలియన్ల క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ అపూర్వ సన్నివేశాన్ని కలకాలం గుర్తుంచుకునేలా గ్రూపు ఫోటోతో ఈ కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago